manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 1:41 am Editor : Mana Praja Prathinidhi

శ్రీలంకకు భారత్ సాయం

ఆపరేషన్ సాగర్ బంధు లో భాగంగా భారీ సహాయక సరుకుల రవాణా
– ఐఏఎఫ్ సి-130 జే విమానంలో అత్యవసర సహాయక సామగ్రి
– విపత్తు సమయంలో మానవతా సేవలకు భారత్ ముందడుగు
– కొలంబో చేరుకున్న సహాయక సరుకులు పునరావాస చర్యలకు తోడ్పాటు
న్యూఢిల్లీ, 29 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమం కింద భారత్ మరోసారి తన మానవతా సేవా ధృక్పథాన్ని చాటుకుంది. భారత వాయుసేనకు చెందిన సి-130 జే ప్రత్యేక విమానం సుమారు పన్నెండు టన్నుల అత్యవసర సహాయక సామగ్రితో శ్రీలంక రాజధాని కొలంబోలో దిగింది. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భారత్ అందించిన ఈ సహాయం విపత్తుతో బాధపడుతున్న ప్రజలకు కీలకమైన ఉపశమనం అందించనుంది.
విమానంలో టెంట్లు, తార్పాలిన్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, వెంటనే వాడుకోగల ఆహార ప్యాకెట్లు వంటి ముఖ్యమైన సామాగ్రి ఉంది. తీవ్ర పరిస్థితుల్లో నివాసం కోల్పోయిన కుటుంబాలకు ఈ సాయప్యాకెట్లు అత్యవసరంగా ఉపకరించనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలతో తక్షణమే ఈ సరుకుల పంపిణీ చేపట్టడం గమనార్హంగా మారింది.
శ్రీలంక ప్రభుత్వం ఈసహాయాన్నిహృదయపూర్వకంగాస్వాగతించింది. ప్రస్తుతపరిస్థితుల్లోభారత్అందించినమద్దతుదేశానికిఅత్యవసరంగాఅవసరమైనభరోసాకల్పించిందనిశ్రీలంకఅధికారులు తెలిపారు. రెండు దేశాలు విపత్తు సమయంలో పరస్పర సహకారాన్ని కొనసాగించడం దక్షిణాసియా ప్రాంతీయ ఐక్యతకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మానవతా విలువలను ముందుంచే భారత విదేశాంగ విధానం మరొక్కసారి వెలుగులోకి వచ్చింది.ఆపరేషన్ సాగర్ బంధు భారత్ చేపట్టే సముద్ర ఆధారిత మానవతా కార్యక్రమాలలో ఒక ముఖ్య భాగం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, విదేశాంగ శాఖల సమన్వయంతో ఇలాంటి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. అప్రతిహతంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం భారతదేశం పొరుగు దేశాలకు ఆపదలో అండగా నిలిచే దేశంగా ఉన్న ప్రతిష్ఠను మరింత పెంచుతోంది.