మన ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తి నియోజకవర్గం
అన్నమయ్య,చిత్తూరు,తిరుపతిజిల్లాలసమీక్షాసమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి గణేష్ యాదవ్కుడీసీసీఅధ్యక్షులు బాలగురవంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలుశాలువాలు,పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమం జిల్లాలో రాజకీయ వేడి పెంచింది.సమీక్షా సమావేశంలో పార్టీ బలపరిచే కార్యక్రమాలు, గ్రామస్థాయి బూత్ కమిటీల చురుకుదనం, రాబోయే ఎన్నికల వ్యూహాలు వంటి కీలక అంశాలపై నేతలు చర్చించారు.కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి,జిల్లాఎస్టీసెల్అధ్యక్షులుజ్యోతిశ్వర్నాయక్,రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్,ఆషిఫ్ నాగేష్, సాయి, ఖాదర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.