ఉద్యోగులకు ఈపీఎఫ్‌ సంస్థ నుంచి భారీగుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీ, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి): పిఎఫ్‌ ఉద్యోగుల కనీస పెన్షన్‌ మొత్తం పెరగనుంది. ఉద్యోగుల పెన్షన్‌ పథకంలోని కనీస పెన్షన్‌ పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వంనుంచి ఎప్పుడైనా రావొచ్చు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. పెన్షన్‌ పథకం కింద నెలకు కనీస పెన్షన్‌ను రూ.5,500కు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1,000 మాత్రమే అందుతోంది. ఇది అమల్లోకి వస్తే కనీస పెన్షన్‌ రూ.4,500 మేర పెరుగుతుంది. ఉద్యోగి సంఘాలు ఈ పెంపును డిమాండ్‌ చేస్తున్నాయి. రాబోయే విశ్వస్థుల మండలి...