manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 2:52 pm Editor : Mana Praja Prathinidhi

తొండ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

తిరుమలగిరి మండలం//మనప్రజాప్రతినిధి//నవంబర్ 29
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మరియు జిల్లా ఎస్పీ కే. నరసింహ (IPS) తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ సెంటర్‌ను పరిశీలించి, నామినేషన్ స్వీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.కలెక్టర్, ఎస్పీ నామినేషన్ కేంద్రంలోని ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బంది నిర్వహణను సమీక్షించారు.ఎన్నికలప్రక్రియపారదర్శకంగా,సాఫీగానిర్వహించేలాజాగ్రత్తలుతీసుకోవాలనిఅధికారులనుఆదేశించారు.ఈకార్యక్రమంలో తహసిల్దార్ బి. హరి ప్రసాద్,ఎంపీడీవో లాజరు, సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు.