మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం. నవంబర్ 29
హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వృద్ధురాలని ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ సంఘటన తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మనవరాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.