మెదక్//మనప్రజాప్రతినిధి నవంబర్21:
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట మల్లేశం అనే యువ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడడంలో అక్కడున్న వారు అడ్డుకున్నారు.మల్లేశం అనే రైతుకు చౌటాకూర్ శివారులోని సర్వే నంబర్ 15/27,15/31 లో గత 50 సంవత్సరాలుగా కబ్జాలో ఉండి సాగు చేస్తున్నారు. 2 ఎకరాల 37 గుంటల భూమి అధికారులు రిజిస్ట్రేషన్ చేయకుండా పర్వత్ విజయభాస్కర్ రెడ్డి, పర్వత్ విష్ణువర్ధన్ రెడ్డి, పర్వత్ అన్వేష్ రెడ్డిలు వేధిస్తున్నారు. అంటూ బాధితుడు ఆరోపించారు.ఈ భూమికి సంబంధించిన ఒప్పంద లిఖిత పత్రాలు బాధితుడి వద్ద లేకపోవడంతో అధికారులు ఏంచేయలేమంటున్నారు.తనకు న్యాయం చేయాలంటూ రైతు మల్లేశం రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.