తేజస్ ప్రమాదంపై హెచ్ఏఎల్ కీలక వ్యాఖ్యలు
తేజస్ ప్రమాదంపై హెచ్ఏఎల్ విచారంషేర్ మార్కెట్లో కంపెనీ వాటాల పతనంవిచారణకు పూర్తి సహకారం హామీబెంగళూరు, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):దుబాయ్ విమాన ప్రదర్శనలో కూలిపోయిన తేజస్ యుద్ధ విమానం ప్రమాదం దేశాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో వాయుసేన అధికారిగా పనిచేసిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ ప్రాణాలు కోల్పోవడం పట్ల హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ తీవ్ర బాధ వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం అసాధారణ పరిస్థితుల్లో జరిగినదని సంస్థ ప్రకటించింది. పైలట్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ప్రమాద ప్రభావం మార్కెట్లో కూడా కనిపించింది. ఉదయం ప్రారంభమైన...