2027 తర్వాత మరో ఐసీసీ టోర్నీకి కోహ్లీ, రోహిత్?
ముంబై, నవంబర్13 (మనప్రజాప్రతినిధి ): భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త! క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటింగ్ ద్వయంగా పేరొందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కూడా ఒక కీలక ఐసీసీ (ICC) టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కేవలం 2027 వన్డే ప్రపంచ కప్ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారని భావిస్తున్న తరుణంలో, వారి కెరీర్ ప్రణాళికలు అంతకు మించి కూడా కొనసాగవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఐసీసీ (ICC)...