మనప్రజాప్రతినిధి // మనకొండూరు. నవంబర్ 29.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఓగులాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వికృతీ లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు ఆరె కొంరెయ్య, గుండేటటి ప్రశాంత్, అల్వాల రాజేశం తదితరులు పాల్గొన్నారు.