manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:26 pm Posted by : Mana Praja Prathinidhi

కాశీ విశ్వేశ్వరుడి దర్శనం.. మంత్రి అనిత ప్రత్యేక పూజలు

– కార్తీక మాసంలో పవిత్ర యాత్ర
– కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
– రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దైవ ఆశీస్సుల ప్రార్థన

కాశీ, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):
కార్తీక మాసం సందర్భంగా కాశీ విశ్వేశ్వరుల ఆలయాన్ని సందర్శించిన మంత్రి అనిత వంగలపూడి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర మాసంలో కాశీ దర్శనం లభించడం పూర్వజన్మ సుకృతమని భావిస్తూ, ఆమె హారతులు, అభిషేకాలు, నైవేద్యాలతో సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కాశీ వీధుల్లో భక్తి వాతావరణం నెలకొనగా, అనిత వంగలపూడి కుటుంబంతో కలిసి ఆలయం పరిసరాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించగా, ఈ సందర్భంగా ఆమె భక్తి భావనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలని, కష్టాలు తొలగిపోవాలని దేవదేవుని ఆశీస్సులు కోరుకున్నట్లు అనిత తెలిపారు. రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి, ఐక్యత కలగాలని ఆమె ప్రార్థించారు. కాశీలో కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి దైవ దర్శనం పొందుతున్నారు.