manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 11:45 am Editor : Mana Praja Prathinidhi

ప్రజావాణి కార్యక్రమం రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక నిలిపివేత — ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
మనప్రజాప్రతినిధి,//రాజన్న సిరిసిల్ల
నవంబర్‌–30
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో, ఎన్నికల కాలంలో ఏవైనా నిర్వాహక, పరిపాలనా సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా ప్రజా సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించే కార్యక్రమాలను కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ—
“ఎన్నికల ప్రక్రియలో జిల్లా పరిపాలన మొత్తం చురుకుగాపాల్గొంటోంది. ఈ సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావడంతో రద్దు చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.ఇంతకాలం ప్రజలకు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా పనిచేసిన ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రజలు తమ అత్యవసర అవసరాలను సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా లేదా మాధ్యమాల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రజావాణి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించే తేదీని అధికారికంగా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ తాత్కాలిక మార్పును గమనించి సహకరించాలని కోరారు.