మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.నవంబర్ 30
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో, డిసెంబర్ 1వ తేదీన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ హేమావతి ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ప్రజావాణిని నిర్వహించబోమని, కోడ్ ముగిసిన తర్వాత కార్యక్రమం మళ్లీ యథావిధిగా ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ హేమావతి సూచించారు.