మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట, నవంబర్ 15:
ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల బ్లాక్ బెల్ట్ మాస్టర్లను ఆఫీస్ దగ్గరకి రప్పించుకొని మీటింగ్ ఏర్పాటు చేసి సీనియర్ వైజ్ గా ఒక్కొక్కరికి ఒక క్లాస్ మాత్రమే వచ్చే విధంగా మొదటి విడతలో ఉన్న 27 పీఎం శ్రీ స్కూళ్లలో వచ్చిన క్లాసులను అందరికీ పంచడం జరిగింది. కానీ కొంతమంది మాస్టార్లు ఈ డివిజన్ నాది అన్ని క్లాసులు నాకే కావాలి అనడం వల్ల వెంకట నర్సయ్య సార్ గారు తిరస్కరించి వేరే మాస్టర్ కు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉన్నవి 27 క్లాసులు వచ్చిన మాస్టర్లు 100కు పైగా వస్తే ఒక్కరికి రెండు మూడు క్లాసులు వేసి ఎలా ఇస్తారు. ఇది జీవించుకోలేక ఆ అధికారి పై అనుచిత వ్యాఖ్యలను చేయడం సరైనది కాదు. దీన్ని మేము సీనియర్ మాస్టర్లము ఏలాదాస్, ప్రభాకర్, మల్లేశం, ఖండిస్తున్నాము.