మనప్రజాప్రతినిధి//తిరుపతి, నవంబర్22
ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని,రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని,రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని మెక్కులు చెల్లించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అనంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వాద్ మండపంలో కూర్చోబెట్టి ఆశీర్వాచన చేసి,స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య తో పాటు కమిషన్ సభ్యులు నెనావత్ రాంబాబు నాయక్,సంగారెడ్డి జిల్లా ది డిస్టిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈవో శ్రీనివాస్, పిఎ శ్రీధర్,శ్రీశైలం,సాయి కుమార్,సంజీవ్,శక్రు,సాయి,తదితరులు ఉన్నారు.