manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 7:59 am Editor : Mana Praja Prathinidhi

సంస్కృత అకాడమీ చైర్మన్ కలిసిన… జిల్లా జాప్ అధ్యక్షులు వంగపరపు  ప్రభాకర్…..

ప్రజాప్రతినిధి(రేణుగుంట, నవంబర్ 24:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్  విల్సన్ (శరత్ చంద్ర) ని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నందు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర జాప్ కార్యదర్శి శ్రీ లక్ష్మిపతి సూచనలతో తిరుపతి జిల్లా జాప్ అధ్యక్షులు శ్రీ వంగ పరపు ప్రభాకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు వరప్రసాద్(వార్త స్టాప్ రిపోర్టర్).   రిపోర్టర్  భాగ్యరాజ్, సూర్యోదయం రిపోర్టర్ సంకేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. జిల్లాలో జాప్ బాగా పుంజుకుంటుందని, నియోజకవర్గం, మండల  స్థాయిలో జాప్ కమిటీలు నియమిస్తున్నట్లు ప్రభాకర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు.