పెరుగుతున్న యూపీఐ మోసాలు
- తెలంగాణ పోలీస్ కీలక హెచ్చరికలుహైదరాబాద్, 25 నవంబర్ 2025 (మనప్రజాప్రతినిధి):డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగిన నేపథ్యంలో యూపీఐ మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలంగాణ పోలీస్ హెచ్చరించింది. గుర్తు తెలియని కంటాక్టులకు డబ్బు పంపే ముందు వారి యూపీఐ ఐడిని ఒకసారి కచ్చితంగా చెక్ చేయాలని సూచించింది. చిన్న పొరపాటు పెద్ద ఆర్థిక నష్టానికి దారితీయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు పంపించే లింకులు, మెసేజ్లు, క్యూఆర్ కోడ్లను స్కాన్...