మనప్రజాప్రతినిధి(చేర్యాల నవంబర్ 16)
చేర్యాల మండలం సలాక్ పురం గ్రామం నుండి ముస్త్యాల గ్రామం మీదుగా అక్రమ మట్టి ని తరలిస్తున్న లారీలను ఆపిన గ్రామస్తులపై ఇటుక బట్టి వ్యాపారులు బెదిరించారని దీని కోసం పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించగా అధికారులు లేరని బయటకు పంపించగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు దీనికి పోలీసులువచ్చి వారిని ఆందోళన నుండి విరమించి అక్రమ మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు