ప్రజలుప్రలోభాలకుగురికావద్దు:ఏసీపీరవీందర్ రెడ్డిహెచ్చరిక
మనప్రజాప్రతినిధిఅక్బర్పేట, భూంపల్లి మండలం, దుబ్బాక నియోజకవర్గం,నవంబర్30 సిద్దిపేటజిల్లా స్థానికసంస్థలఎన్నికలు శాంతియుతవాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రజలు పూర్తిసహకారంఅందించాలని ఏసీపీరవీందర్ రెడ్డి సూచించారు. మిరుదొడ్డి మండలంలోని అల్వాల,రుద్రారం,చెప్యాల గ్రామాల్లో పోలీసులు,ప్రత్యేకదళాలు సంయుక్తంగా భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.గ్రామాల్లోశాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చేపట్టిన ఈకార్యక్రమంలోదుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ఎస్సైలు సమత,హరీష్ గౌడ్ పాల్గొన్నారు. ఏసీపీరవీందర్ రెడ్డిమాట్లాడుతూ“ఎన్నికలసమయంలోఅభ్యర్థులు ఎలాంటిప్రలోభాలకు గురిచేసినావెంటనేసమాచారంఇవ్వాలి. మద్యం. డబ్బులు పంచితే కఠిన చర్యలుతప్పవు” అనిస్పష్టంచేశారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగాతమఓటుహక్కునువినియోగించుకునేలా గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లుతెలిపారు. మద్యం, డబ్బులుపంచితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేకనిఘా ఏర్పాటుచేసారు. ఓటుహక్కు నునమ్ముకొని జీవించండి. ఓటును అమ్ముకొని కాదని పేర్కొన్నారు..