మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట.భూంపల్లిమండలం.
సిద్దిపేట జిల్లా. డిసెంబర్ 2
భూంపల్లి గ్రామానికి చెందిన పుణ్యమైన కనకరాజు అకస్మాత్తుగా మరణించడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌ. శ్రీ బక్కి వెంకటయ్య ఈరోజు గ్రామానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. అనంతరం కనకరాజుకు ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కుటుంబాన్ని ఓదారుస్తూ, అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున తమ సహకారం ఉంటుందని చైర్మన్ వెంకటయ్య భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జన్నారెడ్డి, బోయిని నరేష్, నందం, ఉడిది నర్సింలు, గంగారమైన స్వామి, భూమయ్య, ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.