మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్17
ముస్కానిపేటగ్రామసర్పంచ్గాప్రజలవిశ్వాసాన్ని సంపాదించుకున్న కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇల్లంతకుంట మండల పెన్షనర్ల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవలో ఆయన చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,గ్రామఅభివృద్ధి కోసంఎల్లవేళలా అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తనను ఆదరించి సన్మానించిన పెన్షనర్ల సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల పెన్షనర్ల సంఘం అధ్యక్షులు టి.మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కె. రాజయ్య,కోశాధికారి ఎస్.మల్లేశం,జిల్లాకౌన్సిల్ సభ్యులు బాలనాగచారి, కే.మోహన్ రెడ్డి, రాములు, వెంకన్న, సి.హెచ్. బాల్రెడ్డితదితరులుపాల్గొనిసర్పంచ్ను అభినందించారు.