manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 4:44 pm Posted by : Mana Praja Prathinidhi

ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు.

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.డిసెంబర్25:
తంగళ్లపల్లి మండలం పద్మనగర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంకుసాపూర్ గ్రామానికి చెందిన చందు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం.ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్ సహాయంతో గాయపడిన వ్యక్తిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.