manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 2:35 am Editor : Mana Praja Prathinidhi

బీజేపీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పాయ్ జయంతి కార్యక్రమంం

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 26
ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాజ్‌పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వక్తలు అటల్ బిహారీ వాజ్‌పాయ్ దేశాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయిని శ్రీనివాస్, దేశెట్టీ శ్రీనివాస్, మ్యకల మల్లేశం, మామిడి హరీష్, మండల నాయకులు కామల్ల ఎల్లెష్, లోంకోజు చంద్రం, చిట్యాల శ్రీనివాస్, బూత్ అధ్యక్షుడు బొల్లం రాంసాగర్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.