manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 3:39 pm Editor : Mana Praja Prathinidhi

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలి

_గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు

మన ప్రజాప్రతినిధి//నేరేడు చర్ల, నవంబర్ 1

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ  అభ్యర్థులు
సత్తా చాటాలని  బీజేపీ మాజి మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ యాదవ్  అన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకే ఉందన్నారు. గ్రామ పంచా యతీలకు అధికంగా నిధులు కేటాయించేది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామీణ రోడ్లు, మరుగుదొడ్ల ఏర్పాటుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి పంచాయతీ లకు భారీగా నిధులు వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. . అదే విధంగా నామినేషన్ దాఖలు ప్రక్రియలో అభ్య ర్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు.