manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 2:42 pm Editor : Mana Praja Prathinidhi

సహకారం,అభివృద్ధి,నేతృత్వం:రంగినేని చెంచయ్య నాయుడు స్పెషల్ థాంక్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన కృతజ్ఞతలు తెలిపిన రంగినేని చెంచయ్య నాయుడు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్24
తిరుపతి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా తనను ఎంపిక చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు”ఘనంగాకృతజ్ఞతలుతెలిపారు.అలాగే తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డిలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ అవకాశం తనకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్న రంగినేని చెంచయ్య నాయుడు, రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెట్ కమిటీల బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోందని ఆయన ప్రశంసించారు.