manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 2:20 am Editor : Mana Praja Prathinidhi

ఘనమైన పొగమంచు ఆవరింపు ప్రయాణికులకు, రైతులకు ఇబ్బందులు

మనప్రజాప్రతినిధి// సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్2

సిద్దిపేట జిల్లా మొత్తం మంగళవారం ఉదయం ఘనమైన పొగమంచు కమ్ముకుంది. జిల్లాలోని పలు గ్రామాలు తెల్లవారుజాము నుంచే మంచు పరిచ్ఛిన్నంగా మారగా, ఉదయం 7.30 అయ్యినా పొగమంచు తగ్గకపోవడంతో రహదారి ప్రయాణాలు మందగించాయి.
ద్విత్వ తుఫాను ప్రభావంతో వాతావరణంలో అకస్మాత్తుగా చలిగాలులు పెరగడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం వల్లే ఈ పొగమంచు ఏర్పడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వాహనాలు నడుపుతుంటే హెడ్‌లైట్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాలి
ఇండికేటర్లు వినియోగించాలి.
వేగం తగ్గించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.
రహదారులపై దృశ్యమానం తగ్గిపోవడంతో ప్రయాణికులే కాదు, వెళ్లివస్తున్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు.