manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 2:55 am Posted by : Mana Praja Prathinidhi

సర్పంచులకు సన్మాన కార్యక్రమం

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్

ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం నూతన సర్పంచులను, ఉప సర్పంచ్లను, వార్డు సభ్యులను గజ్వేల్ పట్టణంలోని మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన సర్పంచులందరూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన గ్రామస్తులందరినీ కలుపుకొని సమన్యాయంతో కలిసి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.