మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్6దుద్దెడగ్రామపంచాయితీ సర్పంచ్ పదవికి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అనంతుల నరేందర్ గ్రామ ప్రజలను ఆశ్రయిస్తూ అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్ రావు గారి చొరవతో గ్రామానికి అధిక నిధులు తెచ్చి, దుద్దెడను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలోతాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంసాగునీటి సౌకర్యాల విస్తరణనూతన గృహాల మంజూరునిరంతర విద్యుత్ సరఫరా మెరుగైన రహదారులు డ్రైనేజీ వ్యవస్థమౌలిక వసతుల అభివృద్ధివంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానన్నారు. ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ పరిపాలన సేవలు అందేలా చేస్తానని, ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటా నన్నారు.గ్రామ ప్రజలకు నిత్యం అందు బాటులో ఉండి, దుద్దెడ గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తానని అనంతుల నరేందర్ తెలిపారు.