మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్10తిమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రాట్ల గణేష్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.గణేష్ నాయక్ మాట్లాడుతూ“మీరు ఆశీర్వదించి బ్యాలెట్ పేపర్లో క్రమసంఖ్య 1 వద్ద ఉన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే, తిమ్మక్కపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. ప్రతి ఇంటి సమస్యకు అందుబా టులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తాను” అని తెలిపారు. అలాగే ఆయన అన్నారు“మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సాగరం గారి నాయకత్వంలో, గ్రామాన్ని అభివృద్ధి బాటలో వేగంగా నడిపిస్తాం. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రామ ప్రజలకు చైతన్యం కల్పిస్తూ ముందుకు సాగుతా ను.”చివరిగా ఆయన కోరుతూ “తిమ్మక్కపల్లిని మరింత అభివృద్ధి చేయడానికి నాకు మీ మద్దతు అవసరం. దయచేసి ఉంగరం గుర్తు క్రమసంఖ్య 1కు మీ అమూల్యమైన ఓటును వేసి, నన్ను భారీ మెజారి టీతో గెలిపించండి” అని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.