సర్పంచ్ అభ్యర్థి నెల్లి భూదెమ్మ
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్12
జానకంపల్లి గ్రామ సర్పంచ్ పదవికి నెల్లి భూదెమ్మ నామినేషన్ వేసినవిషయంతెలిసిందే. గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు.గ్రామ ప్రజలతో ప్రచార సందర్భంగా భూదెమ్మ మాట్లాడు తూ“ఒక్కసారి గెలిపించి చూడండి… జానకంపల్లి అభివృద్ధి ఏంటో చూపిస్తా.గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, మన ఊరి ప్రతి మూలా మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఆడబిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను… దీవించి, ఆశీర్వదించి నాకు మీ అమూల్యమై న ఓటును ఇచ్చి గెలిపించండి” అని అన్నారు.అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి పథకాన్ని ప్రజల్లోకి చేర్చేందుకు,గ్రామస్తు లసమస్యలను ప్రత్యక్షంగా వినిపించి వెంటనే పరిష్కారాలు చూపేం దుకు కట్టుబడి పనిచేస్తానని ఆమె తెలిపారు.“ఉంగరం గుర్తుకుఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి.జానకంపల్లి అభివృద్ధి నా లక్ష్యం… మీ నమ్మకం నాకు బలం” అని నెల్లి భూదెమ్మ గ్రామ ప్రజలను కోరారు.