manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:44 am Editor : Mana Praja Prathinidhi

శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతరలో ఎమ్మెల్యే ఆదిమూలం సందడి

ట్రస్టు బోర్డు నియామకాలతో కోలా ఆనంద్  

ఇంట్లో రాజకీయ హీట్
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 11
శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర బుధవారం రాజకీయ రంగును సంతరించుకుంది. వేలాది మంది భక్తులతో సందడిగా సాగుతున్న జాతరలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రాకతో జాతర ప్రాంగణం కాసేపు హడావుడిగా మారింది.జాతర దర్శనం అనంతరం, ఇటీవల శ్రీ కాళహస్తీశ్వరాలయం ట్రస్టు బోర్డు సభ్యులుగా బాధ్యతలు పొందిన బీజేపీ నేత కోలా ఆనంద్ సతీమణికి ఎమ్మెల్యే ఆదిమూలం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కోలా ఆనంద్ ఇంటికి ఎమ్మెల్యే చేరుకోవడంతో అక్కడ రాజకీయ నేతలు,కార్యకర్తలు గుమికూడి సందడి వాతావరణాన్ని సృష్టించారు. కోలాఆనంద్ఇచ్చినఆతిథ్యాన్నిస్వీక రిస్తూఎమ్మెల్యే ఆదిమూలం స్థానిక అభివృద్ధి, ఆలయ వ్యవహా రాలపై స్నేహపూర్వక చర్చలు చేసినట్లు సమాచారం. జాతర నేపథ్యంలోజరి గిన ఈ వీడ్కోలు-స్వాగత కార్యక్రమం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.