మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్27
శైవ సంప్రదాయంలో విశిష్టమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం ఈరోజు భక్తులతో సందడి చేసింది. శాస్త్రాల ప్రకారం, ఈ మాసం పరమశివుడు నటరాజ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన దివ్య ఆరుద్ర నక్షత్రమాసం గా పరిగణించబడుతుంది. భక్తుల ఆలయంలోని విశ్వాసం ప్రకారం, శివారాధన ద్వారా జన్మజన్మాంతర పాపాలు నశించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కుటుంబ శాంతి, సుఖసంతోషాలు లభిస్తాయి.ఈ సందర్భంగా ప్రముఖులు స్వామి వారిని దర్శించడానికి వచ్చి, భక్తులను స్వాగతించి తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్య అతిధులు:
•ఆలయ చైర్మన్. కార్యనిర్వాహనాధికారి.బత్తల గిరినాయుడు,
•బి. గోపాల్, ప్రణాళిక విభాగం నిర్వాహకుడు, విజయవాడ
•రాజేష్ కుమార్ సింగ్, పంచాయతీ రాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి, భారత ప్రభుత్వం
•బి. గంగాధర్, , డిఐజి.సిఐడి.సిబి పోలీస్ శాఖ,ఒడిషా
•నటుడు శివాజీ కుమారుడు సైశేషాంక్, హైదరాబాద్
ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక ఆరాధనలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులకూ, ముఖ్య అతిధులకూ దేవస్థానం ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.