పాపన్నపేట,మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 01:
మండల కేంద్రం పాపన్నపేటలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగణం, ప్రధాన చౌరస్తా, దుకాణాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు.డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాలనుగుర్తించేందుకు,అలాగేఅవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు మరియు సంబంధిత విభాగ సిబ్బంది పాల్గొన్నారు.