manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 4:06 pm Editor : Mana Praja Prathinidhi

అల్మస్‌పూర్ గ్రామంలో సర్పంచ్ పదవీ బాధ్యతలు.ప్రమాణ స్వీకరణ.

అక్బర్‌పేట-భూంపల్లి మండలం, సిద్దిపేట జిల్లా – ఈ రోజు బి.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నాయకులు అల్మస్‌పూర్ నూతన సర్పంచ్గా మీరపురం పద్మ -మల్లేశం గెలిచి, పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీరపురం పద్మ మల్లేశం మాట్లాడుతూ, గ్రామం అభివృద్ధి కోసం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా కృషి చేస్తారని, గ్రామస్తులు కూడా కలిసి పనిచేసి అల్మస్‌పూర్‌ను నెంబర్ వన్ గ్రామ పంచాయతీ, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాల్సిందని అన్నారు.గ్రామ సమస్యలను పరిష్కరించడం, ప్రజల జీవితాలు మెరుగుపరచడం కోసం నూతన సర్పంచ్ తన కర్తవ్యంతో పూర్తి సహృదయంతో నిర్వర్తించబోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన ఉప సర్పంచ్ గుజ్జుల చంద్రం, వార్డు మెంబర్లు బండారు దుర్గవ్వ,పోచబోయిన పద్మ. వంగనర్సింహారెడ్డి. బండారు కనకయ్య. మండల నర్సింలు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.