manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 6:14 pm Editor : Mana Praja Prathinidhi

తిమ్మనగర్ గ్రామ ప్రజలే నా బలగంచిక్కుల ఈశ్వర్ నియోజకవర్గ పిలుపు

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.మండలం.డిసెంబర్12
తిమ్మనగర్ గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా దాఖలు చేయబడిన చిక్కుల ఈశ్వర్ ఈ సందర్భంగా గ్రామంపై మొట్ట మొదటి బాధ్యతను తీసుకుని మిడిమిడి అభివృద్ధి పనులను చేపట్టే స్పఠ సంకల్పాన్ని వ్యక్తం చేశారు.చిక్కుల ఈశ్వర్ ప్రసంగంలో తెలియజే శారు:“నా గ్రామ ప్రజలే నా బలగం. మీరు ఇచ్చే ఓటే నా శక్తి తిమ్మన గర్‌ను నిజమైన అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని నా ప్రతిజ్ఞ. గ్రామీణ మార్గాలు, శుద్ధ నీరు, విద్యారంగం, ఆరోగ్య సదుపాయాలు మరియు మహిళా సంక్షేమ పనులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి కుటుంబానికి నేరుగా సేవలు చేరవేస్తాను. సమస్యలు ఉంటే నాతో చెప్పండి వాటిని పరిష్కరించేందుకు నేను కృషి చేస్తాను.”ఆయన తన పిలుపులో గ్రామస్తులను ప్రత్యేకంగా కోరారు:“మీ అమూల్యమైన ఓటు ✂️ కత్తెర గుర్తుకు వేసి నన్ను సర్పంచ్‌గా ఎన్నుకోండి. మీ ఆశీస్సులు, సహకారం వల్లే తిమ్మనగర్ సార్థకంగా మారుతుంది. భారీ మెజారిటీ తో గెలిపించి నాకు అవకాశం ఇవ్వండి.”ఈ వేడుకలో సమీప నాయ కులు, గ్రామ పెద్దలూ, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని వైవిధ్య భరితంగా మద్దతు వ్యక్తం చేశారు.