మనప్రజాప్రతినిధి//దుబ్బాకనియోజకవర్గం,సిద్దిపేట జిల్లా.డిసెంబర్4 అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని అల్మస్పూర్ గ్రామ సర్పంచ్గా మీరపురం పద్మ మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “గ్రామాభివృద్ధే మా లక్ష్యం. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను” అని తెలిపారు.గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తులతో కలిసి గుర్తించి, వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పద్మ మల్లేశం అన్నారు. “గ్రామానికి అవసరమైన ప్రతి సదుపాయాన్ని అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తాము” అని హామీ ఇచ్చారు.ఇక గ్రామంలో ఆరు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగాఎన్నుకోబడ్డారు. వారు:
1. బండారు దుర్గవ్వ2. పోచమైన పద్మ3. గుజ్జుల చంద్రం4. వంగ నర్సింహారెడ్డి5. బండారు కనకయ్య6. మండల నర్సింలుపదవులను అప్పగించి, తమపై నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధి పరంగా అన్నివిధాలా సేవ చేస్తామని తెలిపారు.