మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నుండి ప్రారంభమైన నామినేషన్ ల ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 10 మంది నామినేషన్ లు దాఖలు చేసినట్లు ఏడిఈఏ జె. జగ్జీవన్ తెలిపారు.బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను బుధవారం నుండి ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 10 నామినేషన్ లు దాఖలు అయ్యాయి అన్నారు.కాంగ్రెస్ పార్టీ నుండి 5,బిఆర్ఎస్ పార్టీ తరపున 3,బిజెపి నుండి 1,స్వతంత్ర అభ్యర్థిగా 1 మొత్తం 10 మంది నామినేషన్ లు అందజేశారు అన్నారు.