•విశ్రాంత మండల విద్యాధికారి బ్రహ్మకుమారి సంస్థ సమ్మేళనంలో పాల్గొని విద్యార్థులకు నైతిక, ఆధ్యాత్మిక విలువల బోధనలో ఆసక్తి
సదాశివపేట,జనవరి17(మనప్రజాప్రతినిధి):
రాజస్థాన్లోని మౌంట్ బాబు ప్రాంతంలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక రాజయోగ, మెడిటేషన్ సమ్మేళనంలో విశ్రాంత మండల విద్యాధికారి మరియు అడ్వకేట్ డి. అంజయ్య పాల్గొన్నారు. ఈ సమ్మేళనం ఈనెల 17 నుంచి 21 వరకు కొనసాగుతుంది.సమ్మేళనంలో ఆధ్యాత్మిక విషయాలు, నైతిక విలువలు, విద్యాభ్యాసం, రాజయోగం, సమాజ సేవలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వ్యక్తిగతంగా మరియు విద్యార్థుల కోసం నైతిక, ఆధ్యాత్మిక, విద్యా విలువలను బోధించడంలో ఉపయోగపడుతుందని డి. అంజయ్య తెలిపారు.
ఇట్లు,
డి.అంజయ్య,విశ్రాంత మండలవిద్యాధికారి