manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 5:18 am Editor : Mana Praja Prathinidhi

లాల్ లక్ష్మీపురం లోడ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా

_బ్రేకట్ట సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…
_వాహనదారులు,ప్రజలకు, మురికి కాలువలో నీళ్ళు పోవాలన్న సరైన వసతు లు లేక ఇబ్బందులకు గురి…
_గ్రామ సర్పంచ్, కార్యదర్శి, అధికారులు తక్షణమే చొరవ తీసుకొని డ్రైనేజీ కట్ట మరమ్మతులు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు..
_తూతూ మంత్రముగా అధికారుల పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..
_డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది, నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.
_కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ఇప్పుడున్న డ్రైనేజీ బ్రేకట్టను క్రమ బంధంగా నిర్మూలించాలి..
_పాడైన డ్రైనేజీ వ్యవస్థను తొలగించి వాటి స్థానంములో కొత్త డ్రైనేజీ వేసి వాహనదారులకు, పాదాచారులకు ఎలాంటి  ఇబ్బంది లేకుండా  శాశ్వత పరిష్కారం చూపాలిని అధికారులను వేడుకుంటున్నారు…

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి08:

నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో గత ఏడాది నుండి మూల మలుపు దగ్గర బ్రేక్ కట్ట మరమ్మతులు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు, పాదాచారులు, నడవాలన్నా ఎక్కడ కింద పడతాము అనే భయాందోళన  ఇబ్బందులకు గురవుతున్నారు, మురికి కాలువలో  నీరు పోకుండా, చెత్త చెదారం నిల్వ ఉండడంతో నీరు పోవడానికి ఇబ్బందిగా ఉన్నది తక్షణమే అధికారులు చొరవ తీసుకొని లాల్ లక్ష్మీపురం గ్రామపంచాయతీ సమస్యను పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు…