7 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి.

•తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఘాటైన ధర్నా •సిద్ధాపూర్ కాలనీ సర్వే నం.260లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ – తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేత సదాశివపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలోని సిద్ధాపూర్ కాలనీ సర్వే నెంబర్‌ 260లో గత ఏడేళ్లుగా పొజిషన్‌లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం తహసిల్దార్ బాల్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ...