manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:28 pm Editor : Mana Praja Prathinidhi

మణి మొబైల్స్ కట్టెల రమేష్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

•“విద్యార్థుల కోసం శివాజీపై వ్యాసరచన పోటీ”
మెదక్ జిల్లా,వెల్దుర్తి.మనప్రజాప్రతినిధి//జనవరి26
జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్‌లో 8,9,10వ తరగతి విద్యార్థులకు77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శివాజీ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.మణి మొబైల్స్ అధినేత కట్టెల రమేష్ మాట్లాడుతూ, శివాజీ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుడు అని, ఈ పోటీ భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గతంలో ప్రైమరీ స్కూల్లో 50,000 రూపాయల స్వయంత నిధులతో సరస్వతీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రమేష్, వసంత పంచమి సందర్భంలో విద్యార్థులకు స్వీట్లు పంచడం కూడా ఆచారంగా కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సాంబయ్య, ఉపాధ్యాయులు, సర్పంచి దండం ఆదర్శ్, ఉప సర్పంచ్ కమ్మరి శ్రావణ్, వార్డ్ మెంబర్లు, స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.