మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29: ఖేడ్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల సందర్బంగా 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మఠం శైలజ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.వార్డు ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు.