ఉత్తమ మున్సిపాలిటీ మేనేజర్గా నాగేశ్వరరావుకు కలెక్టర్ ప్రశంస.
ప్రజాప్రతినిధి//సత్తుపల్లిజనవరి 26:
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఖమ్మం పేరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతులమీదుగా కల్లూరు మున్సిపల్ మేనేజర్ నంది శెట్టి నాగేశ్వరరావు ఉత్తమ మేనేజర్గా ప్రశంస పొందారు.ప్రశాంసాపత్రం ప్రదానం సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ పరిపాలనలో ఉన్నత ప్రదర్శన ప్రజల సంక్షేమానికి కీలకమని, అందరూ ఇలాంటి కృషి చేయాలని పిలుపునిచ్చారు.నా సేవలను గుర్తించి ప్రశస్తి అందించడం సంతోషకరమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది, ఎన్జీవో స్ అభినందాలు తెలిపారు.