•యువతకు ఆదర్శం, ప్రజల కోసం సేవ…నారా లోకేష్ జన్మదిన ఘనత
•అన్నదానంలో దాతృత్వం, ప్రజాసేవలో నాయకత్వం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23
శుక్రవారం ఉదయం నుండి రాష్ట్ర విద్య. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పేడు మండల కేంద్రంలో ప్రత్యేక అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది. యువతకు ఆదర్శంగా, ప్రజల సేవలో నడుస్తున్న ఆయన ఈ సందర్భంగా స్థానికుల కోసం దాతృత్వం ప్రదర్శించారు.కార్యక్రమాన్ని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ప్రియతమ శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రుషితా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా శివశంకర్ రెడ్డి, సూరి నాయుడు, మోహన్ నాయుడు, బాబు నాయుడు, హేమాక్షి, క్రిష్ణవేణి, గుణాయాదవ్, కె కె రమణ, రాచటి సుబ్రహ్మణ్యం, హంస, రవి నాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, మునిరెడ్డి, రాఘవేంద్ర, సురేష్, నగేష్ నాయుడు, నారాయణ, రామదాసు, నాగరాణి, మణి, శివ, మునిరాజా యాదవ్, వై మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా యువ నేత, ప్రజాసేవకుడు నారా లోకేష్ పుట్టినరోజును ప్రతీకాత్మకంగా ప్రజల కోసం, సేవలో గడిపి దాతృత్వం ప్రదర్శించిన ఘన ఉదాహరణగా నిలిచింది.