manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 7:24 am Editor : MANA PRAJA PRATINIDHI

ఇటుక బట్టీలను తనిఖీ చేసిన అధికారులు

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:

సిర్గాపూర్ మండల కేంద్రంలో గల ఇటుక బట్టీలను బుధవారం నారాయణఖేడ్ సహాయక కార్మిక అధికారి యాదయ్య,ఎస్సై మొగులయ్యాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఏఎల్ ఓ యాదయ్య మాట్లాడుతూ.. బాలకార్మికుల చేత పనులు చేయించరాదనీ,వలస కార్మికుల పిల్లలకు చదువు చెప్పడానికి వారి రాష్ట్రానికి చెందిన విద్యావంతుడిని ఉపాధ్యాయుడిగా ఇటుక బట్టి యాజమాన్యం ఏర్పాటు చేయాలి అన్నారు. ఇటుక బట్టీలే కాకుండా ఏ వ్యాపార సంస్థ,ఇళ్లలో బాల కార్మికులచేత పనులు చేయించిన కఠిన చర్యలు తప్పవు అన్నారు.