manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 2:31 pm Editor : Mana Praja Prathinidhi

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌడ సోదరులు ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు..

•“నాలాచెరువు సాయి కిరణ్, సంపత్ గౌడ్ లకు ప్రశంసాపత్రాలు”
మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి26
మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణానికి చెందిన సోదరులు నాలాచెరువు సాయి కిరణ్ గౌడ్ (సబ్ ఇంజనీర్, తూప్రాన్ డివిజన్, విద్యుత్ విభాగం)నాలాచెరువు సంపత్ గౌడ్ (డీ సీ మేనేజర్, మెదక్ జిల్లా) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపును పొందారు.బాల్యం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఇరు సోదరులు, ఉద్యోగ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనకు కారణమయ్యారు. గౌడ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు వారి ప్రతిభకు అభినందనలు తెలిపారు.