వాణీనికేతన్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 09 జనవరి:ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ. సాంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా అందమైన డిజైన్లు వేయడం జరిగింది. చిన్నారులకు భోగి పండ్లు పోసి, భోగి మంటలు వేశారు, ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మకతను వెలికి తీయాలనే లక్ష్యంతో, సాంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలని లక్ష్యంలో భాగంగా ముందస్తు...