manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 9:11 am Editor : Mana Praja Prathinidhi

సిద్దిపేటలో అమరవీరులకు ఘన నివాళులు

రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఖమ్మంపల్లి సత్యనారాయణకు ఘన సత్కారం
సిద్దిపేట,జనవరి10(మనప్రజాప్రతినిధి):
రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మానకొండూర్ ఎమ్మెల్యే శ్రీ ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు ఈరోజు సిద్దిపేట మీదుగా రంగాజాంపల్లి చౌరస్తా వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు కొమ్ము విజయకుమార్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ గారు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారిని గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక ఫోటోను అందజేశా రు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏసుప్రభు, రాజు సత్యం, మార్క రాహుల్ గౌడ్, కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు బిజని ఎల్లమ్మ, శబొద్దీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.