మనప్రజాప్రతినిధి/మనకొండూరు
తేదీ 08 జనవరి
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను ఎన్నిక కావడంపట్ల ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ ను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు ఉట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు.