manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 2:33 pm Editor : Mana Praja Prathinidhi

అల్మస్పూర్ స్కూల్‌లో సావిత్రిబాయిపూలే జయంతి ఘనంగా జరుపుకున్నారు

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్,భూంపల్లి మండలం.సిద్దిపేటజిల్లా:జనవరి3
మనప్రజాప్రతినిధి భాగస్వామ్యంతో అల్మస్ పూర్ గ్రామంలోని పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించబడింది. సావిత్రిబాయి పూలే మహానీయురాలు కావడం గుర్తిస్తూ, పాఠశాల విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుప్రియ శ్రీ మాట్లాడుతూ, శ్రీమతి సావిత్రిబాయి పూలే మొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి కాబట్టి వారి కృషిని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరు కష్టపడి తమ లక్ష్యాలను సాధించాల న్నారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలూ తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ కీర్తన, అంగన్ వాడి టీచర్ వెంకటమ్మ, ఆశ వర్కర్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. మహోత్సవం స్తోమతతో, గ్రామస్తులు, పూలే కమిటి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఇతరులు పాల్గొని, విద్యార్థులకు మంచి మార్గదర్శకం సృష్టించగా, భారత మహిళల ప్రతిభ, కృషి ప్రపంచానికి తెలియజేసే సందర్భంగా నిలిచింది.