manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:54 am Editor : Mana Praja Prathinidhi

మెదక్BJYM జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారి క్యాలెండర్ ఆవిష్కరణ

మెదక్ జిల్లా,మనప్రజాప్రతినిధి//జనవరి11
రాబోయే మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా BJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారి నూతన క్యాలెండర్‌ను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని గడ్డం శ్రీనివాస్ గారు, మెదక్ టౌన్ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత శక్తితో మెదక్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తఅంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో లోకేష్,ఆంజనేయులు, సంగీత, బబ్లు, సాయి చరణ్, సన్నీ, ఆమ్లం సాయి, కళ్యాణ్, శశాంక్‌ లతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.